చీటింగ్‌ కేసులో అఘోరీ రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

చీటింగ్‌ కేసులో అఘోరీ రిమాండ్‌

Apr 24 2025 8:44 AM | Updated on Apr 24 2025 8:44 AM

చీటింగ్‌ కేసులో  అఘోరీ రిమాండ్‌

చీటింగ్‌ కేసులో అఘోరీ రిమాండ్‌

లింగ నిర్ధారణ పరీక్షలకు నిరాకరణ

తిరిగి కోర్టుకు పంపిన అధికారులు

సంగారెడ్డి టౌన్‌: ఓ చీటింగ్‌ కేసులో అఘోరీని బుధవారం చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో సంగారెడ్డి జిల్లాలోని కంది సెంట్రల్‌ జైలుకు తరలించారు. అయితే ఇక్కడ జైలు అధికారులకు అఘోరీని ఏ బారక్‌లో ఉంచాలో అనే టెన్షన్‌ మొదలైంది. అయితే లింగ నిర్ధారణ పరీక్షలకు నిరాకరించడంతో తిరిగి చేవెళ్ల కోర్టుకు పంపించినట్టు జైలు పర్యవేక్షకులు సంతోష్‌ రాయ్‌ తెలిపారు.

పుస్తక పఠనంతో

మేధో సంపత్తి

గజ్వేల్‌రూరల్‌: పుస్తక పఠనంతోనే మేధో సంపత్తి పెరుగుతుందని గజ్వేల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నిఖత్‌ అంజుమ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని బాలుర ఎడ్యుకేషన్‌ హబ్‌లోగల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ప్రపంచ పుస్తక కాపీరైట్స్‌ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్‌ డాక్టర్‌ వి.వెంకటేశ్వర్లు, వర్తమాన రచయిత డాక్టర్‌ మహేందర్‌రెడ్డి, వెస్‌ ప్రిన్సిపాల్‌ గణపతిరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.

బొంతపల్లిలో

ఇరు వర్గాల ఘర్షణ

జిన్నారం (పటాన్‌చెరు): జిన్నారం మండల కేంద్రంలో విగ్రహ ధ్వంసం చేసిన ఘటన నేపథ్యంలో పలు ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి ప్రధాన రహదారిపై కారులో వెళ్తున్న ఓ వర్గానికి చెందినవారు రెచ్చగొట్టేలా నినాదాలు చేయడంతో మరో వర్గానికి చెందిన వ్యక్తి దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాల వారికి నచ్చజెప్పి వారిని శాంతింపచేశారు. మరో వర్గం విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రోడ్డుపై ధర్నా చేయడంతో కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ట్రాన్స్‌ఫార్మర్‌ను

పగులగొట్టి ఆయిల్‌ చోరీ

దుబ్బాకటౌన్‌: రాయపోల్‌ మండలం బేగంపేట గ్రామంలో మల్కాపూర్‌ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద గల వ్యవసాయ పొలంలో మంగళవారం అర్ధరాత్రి దొంగలు ట్రాన్స్‌ఫార్మర్‌ను పగులగొట్టారు. దానిలోని కాయిల్స్‌, ఆయిల్‌ను దుండగులు ఎత్తుకెళ్లారు. ఇది గమనించిన రైతులు పోలీసులకు విద్యుత్‌, అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. సుమారు వాటి విలు రూ. 50 వేల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. రైతు మల్లమ్మ ఫిర్యాదు మేరకు బేగంపేట ఎస్సై మహిపాల్‌ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నా భర్త ఆచూకీ తెలుపండి

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండల పరిధిలోని గంగాపూర్‌ గ్రామానికి చెందిన శశికళ తన భర్త కనిపించడం లేదని బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొన్ని రోజులుగా ఆమె భర్త మహేశ్‌తో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. అయితే ఈ క్రమంలో చాకలి గోపాల్‌, బండి శోభలు కలిసి శశికళ అత్తమ్మ(64)ను మార్చి 25న బంగారు ఆభరణాల కోసం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి హత్య చేసినట్లు పోలీసులు స్వగ్రామానికి వచ్చారు. దీంతో తన భర్త ఆచూకీ కనిపెట్టాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మందుబాబులకు జరిమానా

సంగారెడ్డి క్రైమ్‌: డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ వాహనదారులకు సంగారెడ్డి జిల్లా న్యాయస్థానం జరిమానా విధించింది. సంగారెడ్డి పట్టణ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి పాత బస్టాండ్‌వద్ద, జాతీయ రహదారి, బైపాస్‌లోని గుర్రపు బొమ్మ వద్ద నిర్వహించిన డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌లో తనిఖీల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని సంగారెడ్డి జిల్లా న్యాయస్థానంలో హాజరుపరచగా జిల్లా అదనపు న్యాయమూర్తి షకీల్‌ అహ్మద్‌ సిద్దిఖీ ఒకరికి రూ.2వేలు, మిగతా నలుగురికి రూ.1,500 చొప్పున జరిమానా విధించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement