
5.33 గంటలు.. 40 కిలో మీటర్లు
మొక్కు చెల్లించడానికి పరుగెత్తారు
దుబ్బాకటౌన్: అనుకున్న లక్ష్యానికి, దైవ భక్తికి ఏ ఆటంకం ఎదురు రాదని దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చెల్లాపూర్ వార్డుకు చెందిన కమ్మరి సాయి వర్ధన్, దుంపలపల్లికి చెందిన దొందడి రాకేశ్ నిరూపించారు. ఇటీవల భారత ఆర్మీ (అగ్నివీర్)కి సాయి వర్ధన్, రాకేశ్ ఎంపికయ్యారు. గురువారం ఇద్దరు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్నకు మొక్కు చెల్లించడానికి స్వగ్రామం నుంచి 40 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 5 గంటల 33 నిమిషాల్లో పరుగెత్తి ఆలయాన్ని చేరుకున్నా రు. కాగా సాయివర్ధన్ గతంలో ఆర్మీ సెలక్షన్లో రెండు సార్లు విఫలమయ్యాడు. దీంతో ఈసారి ఎంపిక కావాలని పట్టువదలని విక్రమార్కుడిలా రోజు ఉదయం గ్రౌండ్లో చెమటోడ్చి అనుకున్న లక్ష్యం సాధించాడు.