వైజ్ఞానిక యాత్రకు చలో..
రాయికోడ్(అందోల్): మండలంలోని ఎస్సీ వసతి గృహం విద్యార్థులు సోమవారం వార్డెన్ కృష్ణ ఆధ్వర్యంలో వైజ్ఞానిక యాత్రకు తరలివెళ్లారు. హైదరాబాద్లోని బిర్లా మందిర్, శాసన సభ, సచివాలయ భవనాలతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ విగ్రహాన్ని సందర్శించారు. సాలార్జంగ్ మ్యూజియంలోని వివిధ వస్తులను తిలకించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. నగర చరిత్రకు తలమానికగా ఉన్న చార్మినార్ పరిసరాలను తిలకించారు. హైకోర్టు, సిటీ కాలేజ్, హుస్సేన్ సాగర్, బుద్ధుడి విగ్రహాన్ని సందర్శించి, చారిత్రక వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో హాస్టల్, సిబ్బంది ఉన్నారు.


