చరిత్రను వక్రీకరిస్తున్న మతోన్మాదులు | - | Sakshi
Sakshi News home page

చరిత్రను వక్రీకరిస్తున్న మతోన్మాదులు

Sep 16 2025 8:34 AM | Updated on Sep 16 2025 8:34 AM

చరిత్రను వక్రీకరిస్తున్న మతోన్మాదులు

చరిత్రను వక్రీకరిస్తున్న మతోన్మాదులు

దుబ్బాక: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంతో ఏమాత్రం సంబంధం లేని మతోన్మాదులు చరిత్రను వక్రీకరించడం దుర్మార్గమని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలో సీపీఎం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి ,వెట్టి చాకిరీ విముక్తి కోసం దున్నేవాడికే భూమి దక్కాలని దొరలు, భూస్వాములు, రజాకార్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశామన్నారు. ఎర్రజెండా నాయకత్వంలో పోరాటాలు నిర్వహించి 10 లక్షల ఎకరాల భూములు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదన్నారు. ఈ సభలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు భాస్కర్‌, జిల్లా నాయకులు గోపాలస్వామి, నవీన, భాస్కర్‌, ఎల్లయ్య, సాధిక్‌ పాల్గొన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement