
ఇల్లు వచ్చేసిందోచ్
డబుల్బెడ్రూమ్
ఇళ్ల తాళాల అప్పగింత
మండలంలోని హోతి(కె) గ్రామ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించగా అందులో మిగిలిన వాటిని కూడా అధికారులు పంపిణీ చేసేశారు. ఈ మేరకు మిగిలిపోయిన ఇళ్లకు సంబంధించి తాళం చెవిలను లబ్ధిదారులకు శనివారం రెవెన్యూ అధికారులు అందజేశారు. దీంతో లబ్ధిదారులు సంతోషంతో స్వీట్లు పంచుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం జహీరాబాద్ ఏరియా కమిటీ సభ్యుడు మహిపాల్, లబ్ధిదారులు పాల్గొన్నారు.
– జహీరాబాద్: