ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలి
సంగారెడ్డి టౌన్ : చిన్నారుల్లో శారీరక, మానసిక ఎదుగుదలను నిరోధించే నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కలెక్టర్ క్రాంతి సూచించారు. కలెక్టరేట్లో వైద్యశాఖ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 20న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల వయసు గల పిల్లలు 4,05,207 మంది ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ప్రతీ ఒక్కరికి మాత్రలు అందించాలని అన్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి గాయత్రీదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ క్రాంతి
Comments
Please login to add a commentAdd a comment