వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య

Jun 16 2024 10:44 AM | Updated on Jun 16 2024 10:44 AM

వేర్వ

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య

దుబ్బాకరూరల్‌: పొలంలో వరి విత్తనాలు చల్లే విషయంలో కుటుంబ సభ్యులతో గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని ఆకారం గ్రామంలో శనివారం జరిగింది. ఎస్‌ఐ గంగరాజ్‌ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గరిగె నారాయణ(85) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆరోగ్యం సహకరించక పోవడంతో ఇటీవల మతి స్థిమితం కోల్పోయాడు. వ్యవసాయం సరిగా చేయడంలేదని తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం పొలంలో విత్తనాలు చల్లే విషయంలో కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ఇంటి ప్రక్కనే ఉన్న గడ్డివాము వద్ద ఉన్న చీరతో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుమారుడు భిక్షపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మనస్తాపంతో గృహిణి..

దుబ్బాకటౌన్‌: మనస్తాపంతో గృహిణి ఉరివేసుకున్న ఘటన దుబ్బాక మున్సిపల్‌ పరిధిలోని చోటుచేసుకుంది. ఎస్‌ఐ గంగరాజు కథనం ప్రకారం.. దుంపలపల్లి వార్డుకు చెందిన ధర్మారెడ్డి నవనీత్‌ రెడ్డి ఆరు సంవత్సరాల క్రితం అదే గ్రామానికి చెందిన సంతోషను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కుమారులున్నారు. నవనీత్‌ రెడ్డి ఉద్యోగ రీత్యా భార్యాపిల్లలలో కలిసి యాదాద్రి జిల్లాలోని తుర్కపల్లిలో జీవనం గడుపుతున్నాడు. సంతోష అప్పుడప్పుడు ఫిట్స్‌, ఛాతీనొప్పి, కడుపు నొప్పితో బాధపడేది. వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో 10రోజుల క్రితం తల్లిగారి గ్రామం దుంపలపల్లికి వెళ్లింది. తీవ్ర మనస్థాపానికి గురై శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నవనీత్‌ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

క్షణికావేశంలో..

మిరుదొడ్డి(దుబ్బాక): క్షణికావేశంలో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల పరిధిలోని పెద్ద చెప్యాలలో శనివారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, మిరుదొడ్డి ఎస్‌ఐ బోయిని పరశురాములు తెలిపిన కథనం ప్రకారం.. పెద్ద చెప్యాల గ్రామానికి చెందిన గజ్జెల బాలరాజు(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. భార్య మాధవి, పదేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం బాలరాజు మద్యంతాగి వచ్చి పొలంలో వరి తూకం విషయంలో భార్యతో గొడవపడ్డాడు. దీంతో క్షణికావేశంలో తుమ్మ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

విత్తనాలు చల్లే విషయంలో వివాదం

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య1
1/1

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement