సీపీఆర్పై అవగాహన తప్పనిసరి
సంగారెడ్డి టౌన్: సడెన్ కార్డియాక్ అరెస్ట్కు గురైన వారిని కాపాడేందుకు సీపీఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలోని పారామెడికల్ సిబ్బందితో పాటు, వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది, పోలీసు, కమ్యూనిటీ వలంటీర్లు, ఉద్యోగులు, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల ప్రతినిధులు, సిబ్బంది, కమర్షియల్ కాంప్లెక్స్ వర్కర్స్ ఇలా వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులకు సీపీఆర్పై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకు 108 సిబ్బందికి శిక్షణ ఇచ్చామని, ప్రతి జిల్లాకు ఐదుగురు మాస్టర్ ట్రైనర్లను ఏర్పాటు చేశామన్నారు. అనంతరం సీపీఆర్ శిక్షణకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కలెక్టరేట్ వద్ద ఎంఆర్ఎఫ్ కార్మికులు హరీశ్రావును కలిసి మద్దతు కోరారు. బస్సు గుర్తుకు ఓటు వేసి హగ్గెళ్లి రాములును అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. వివిధ శాఖల ఉద్యోగులకు సీపీఆర్పై శిక్షణ ఇచ్చారు.