తుర్కయంజాల్: రైతు సేవా సహకార సంఘం పీఐసీ చైర్మన్గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన కొత్తకుర్మ సత్తయ్య, డైరెక్టర్ వంగేటి లక్ష్మారెడ్డిని మంగళవారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ నాయకులు ఘనంగా సన్మానించారు. రైతులకు మొరుగైన సేవలు అందించాలని, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెనిగ్ విష్ణువర్ధన్ రావు, ఉపాధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కారింగుల నరేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క జంగయ్య గౌడ్, బీజేపీ నాయకులు బచ్చిగళ్ల రమేష్, తూళ్ల నర్సింహ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


