డ్రగ్స్‌ సరఫరా ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రగ్స్‌ సరఫరా ముఠా అరెస్ట్‌

Mar 31 2026 10:38 AM | Updated on Mar 31 2026 10:38 AM

శంకర్‌పల్లి: డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌కు చెందిన పొన్నాల సిద్దార్థ్‌(27) సౌత్‌ సెంట్రల్‌ రైల్వే సికింద్రాబాద్‌లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నేళ్లుగా డ్రగ్స్‌కు అలవాటు పడిన సిద్దార్థ్‌ గోవా నుంచి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి పబ్‌లు, క్లబ్‌లతో పాటు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు అమ్ముతున్నాడు. ఈ క్రమంలో విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్‌ చలవాడి హిమంత్‌ కృష్ణవంశీ(30) హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా.. సిద్దార్థ్‌కు పరిచయమయ్యాడు. వీరికి నాచారానికి చెందిన రొయ్యల వ్యాపారి అవదూత విష్ణుతేజ(36) జతయ్యాడు. ముగ్గురూ ముఠాగా ఏర్పడి గోవా నుంచి 39.72 గ్రాముల కొకై న్‌, 3గ్రాముల గంజాయి తీసుకుని మోకిల పీఎస్‌ పరిధిలోని ఇంద్రారెడ్డినగర్‌ మీదుగా వెళ్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆదివారం వాహన తనిఖీలు చేస్తుండగా, ముగ్గురూ డ్రగ్స్‌తో పట్టుబడ్డారు. వీరి నుంచి మాదకద్రవ్యాలతో పాటు కారు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్‌డీపీఎస్‌ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, సోమవారం చేవెళ్ల కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం రిమాండ్‌ నిమిత్తం సంగారెడ్డి జైలుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement