వస్తోంది ‘భరోసా’ | - | Sakshi
Sakshi News home page

వస్తోంది ‘భరోసా’

Mar 20 2026 9:16 AM | Updated on Mar 20 2026 9:16 AM

● రంగారెడ్డి జిల్లాలో 12,42,504 ఎకరాలు భూములు ఉండగా, ఆరున్నర లక్షల ఎకరాల్లో పంట సాగవుతున్నట్లు అంచనా. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకం కింద 2023 వానాకాలంలో జిల్లాలోని 3,22,010 మంది రైతుల ఖాతాల్లో రూ.345.36 కోట్లు జమ చేయగా, 2024 యాసంగిలో 3,25,216 మంది రైతుల ఖాతాల్లో రూ.343.10 కోట్లు జమ చేసింది. ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 జూన్‌లో 2,83,709 మంది రైతుల ఖాతాల్లో రూ.318.69 కోట్లు జమ చేసింది. ● వికారాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2023 వానాకాలంలో 2,88,934 మంది రైతుల ఖాతాల్లో రూ.322.17 కోట్లు జమ చేయగా, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త ర్వాత 2025 జూన్‌లో 2,76,537 మంది రైతుల ఖాతాల్లో రూ.363.10 కోట్లు జమ చేసింది. ప్రస్తుతం లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.

అన్నదాతకు తీపి కబురు 22 నుంచి ఖాతాల్లో పంట సాయం జమ ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌ ప్రకటన ఉమ్మడి జిల్లాలో ఐదున్నర లక్షల మందికి లబ్ధి

సాక్షి, రంగారెడ్డిజిల్లా : ఉగాది పర్వదినం రోజు ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఈ 22 నుంచి ఖాతాల్లో రైతు భరోసా జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఎకరానికి రూ.6 వేల చొప్పున నగదును పంట సాయంగా అందజేయనుంది. మూడు విడతల్లో నగదు జమ చేయనుంది. ఈ మేరకు గురువా రం ఉగాది వేడుకలను పురస్కరించుకుని పంచాంగ పఠనం కార్యక్రమం అనంతంరం సీఎం చేసిన ఈ ప్రకటనతో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లోని ఐదున్నర లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో ఒక ఎకరం వరకు, రెండో విడతలో రెండు ఎకరాల వరకు, మూడో విడతలో ఆ తర్వాతి విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ఏప్రిల్‌ చివరి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లబ్ధిదారుల సంఖ్య పెరిగే అవకాశం

2.5 ఎకరాలలోపు రైతులు : 1.56,355

2.5 నుంచి 5 ఎకరాల లోపు : 56,853

ఐదు నుంచి పది ఎకరాల లోపు : 25,888

పది నుంచి 25 ఎకరాల లోపు : 7,118

25 ఎకరాలకుపైగా ఉన్న రైతులు : 744

రంగారెడ్డి జిల్లాలో ఇదీ లెక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement