
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
● స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి
మూల్యం తప్పదు
● అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే
గువ్వల బాలరాజు
ఆమనగల్లు: ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం తప్పదని తెలిపారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆయన బుధవారం తొలిసారి అచ్చంపేటకు వెళ్తున్న క్రమంలో బీజేపీ ఆమనగల్లు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ.. అన్ని విషయాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తిలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, బీజేపీ రాష్ట్ర నాయకులు కండె హరిప్రసాద్, రాంరెడ్డి, మండల అధ్యక్షుడు కేకేశ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కర్నాటి విక్రంరెడ్డి, బీజేపీ నాయకులు దుర్గయ్య, సుండూరు శేఖర్, లక్ష్మణ్, చెన్నకేశవులు, రవిరాథోడ్ పాల్గొన్నారు.