
విమోచనాన్ని అధికారికంగా నిర్వహిస్తాం
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సయ్యగౌడ్
తుర్కయంజాల్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం తుర్కయంజాల్లో ఆ పార్టీ నాయకులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రాక ముందు ప్రకటనలు చేసి, ఆ తరువాత చేతులు దులుపుకొంటున్నాయని ఆరోపించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. 80 మంది రక్తదానం చేసినట్లు పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, శ్రావణ్కుమార్గౌడ్ తదితరలు పాల్గొన్నారు.