బెస్ట్‌ టీచర్‌్స | - | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ టీచర్‌్స

Sep 5 2025 8:31 AM | Updated on Sep 5 2025 8:31 AM

బెస్ట

బెస్ట్‌ టీచర్‌్స

ధారూరు నుంచి ముగ్గురు కుల్కచర్ల నుంచి రమేశ్‌.. పేద విద్యార్థులకు సేవ..

రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎంపిక

అబ్దుల్లాపూర్‌మెట్‌: బండరావిరాల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న పి.రమాదేవి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. 2002లో మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకూర్‌ మండలం హరిజన్‌వాడ యూపీఎస్‌లో తొలిసారి ఆమె విధుల్లో చేరారు. 2013లో మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా, 2018లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో కలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. 2019లో బెస్ట్‌ రిజల్ట్స్‌ సాధించిన టీచర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవార్డు అందుకున్నారు. 2020లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర స్థాయి బెస్ట్‌ టీచర్‌గా ఎంపిక కావడం సంతోషంగా ఉందని రమాదేవి పేర్కొన్నారు.

ధారూరు: మండలం నుంచి ముగ్గురు టీచర్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ధారూరు బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న లక్ష్మీనర్సమ్మ, మోమిన్‌కలాన్‌ ప్రాథమిక పాఠశాల టీచర్‌ శ్రీనివాస్‌, నాగసమందర్‌ పీఎస్‌ ఉపాధ్యాయురాలు సరిత ఉన్నారు.

కుల్కచర్ల: స్థానిక ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న ఉప్పరి రమేశ్‌ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.

హుడాకాంప్లెక్స్‌: విక్టోరియా మెమోరియల్‌ పాఠశాలలో పనిచేస్తున్న జి.కళావతి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మాది వికారాబాద్‌ జిల్లా ధారూరు మండలం హరిదాసుపల్లి గ్రామం. తండ్రి పాండు రంగారావు రైల్వేలో స్టేషన్‌ మాస్టారు. అమ్మ రత్నమ్మ గృహిణి. నేను 1993లో కేంద్రియ విద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా చేరా. 1994 జూన్‌లో విక్టోరియా మెమోరియల్‌ హోమ్‌ టీచర్‌గా ఎంపికయ్యా. పేద విద్యార్థులకు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది’ అన్నారు.

ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం పలువురు టీచర్లకు అవార్డులు ప్రకటించింది. రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో బెస్ట్‌ టీచర్లుగా ఎంపికయ్యారు.

దామరగిద్దలో..

చేవెళ్ల: చేవెళ్ల మున్సిపల్‌ పరిధిలోని దామరగిద్ద ప్రాథమికోన్నత పాఠశాల ఎస్‌జీటీ ఉపాధ్యాయుడు కె.బాలాజీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 25 ఏళ్లుగా బోధనా వృత్తిలో కొనసాగుతున్న ఆయన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎంఆర్‌పీ, డీఆర్‌ఎపీ, ఎస్‌ఆర్‌పీగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర స్థాయిలో పలు అంశాలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. తెలంగాణ స్టేట్‌ రిసోర్స్‌ గ్రూప్‌ మెంబర్‌గా కొనసాగుతున్నారు. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంపై సంతోషం వ్యక్తం చేశారు.

బెస్ట్‌ టీచర్‌్స1
1/1

బెస్ట్‌ టీచర్‌్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement