మంత్రి సీతక్కను కలిసిన అధికారుల బృందం | - | Sakshi
Sakshi News home page

మంత్రి సీతక్కను కలిసిన అధికారుల బృందం

Apr 30 2025 7:14 AM | Updated on Apr 30 2025 7:14 AM

మంత్ర

మంత్రి సీతక్కను కలిసిన అధికారుల బృందం

యాచారం: స్థానిక ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి, ఎంపీఓ శ్రీలత పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను కలిశారు. మాల్‌ గ్రామ పంచాయతీకి ఆత్మనిర్భర్‌ నేషనల్‌ అవార్డు రావడం, ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా రూ.కోటి ప్రోత్సాహకాన్ని అందుకున్న నేపథ్యంలో మర్యాదపూర్వకంగా మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌మోహన్‌, ఇబ్రహీంపట్నం డివిజన్‌ డీఎల్‌పీఓ సాధన, మాల్‌ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.

నేడు వాజ్‌పేయి శత జయంత్యుత్సవం

హాజరవనున్న ఎంపీలు ఈటల, కొండా

మహేశ్వరం: మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌ శత జయంతి ఉత్సవాలను బుధవారం నిర్వహించనున్నట్లు బీజేపీ మండల అధ్యక్షుడు టి.యాదీశ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. నాగారం పరిధిలోని కుండె వెంకటేశ్‌ ఫామ్‌ హౌస్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్‌గిరి, చేవెళ్ల ఎంపీలు ఈలల రాజేందర్‌, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌ గౌడ్‌, కార్యక్రమ ఇన్‌చార్జి సుదర్శన్‌రెడ్డి, పాపయ్య గౌడ్‌, జంగయ్య యాదవ్‌ హాజరవుతారని చెప్పారు. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

గ్రామాల్లో సైబర్‌ క్రైమ్‌పైఅవగాహన కల్పించండి

కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

మాడ్గుల: శాంతి భద్రతల పరిరక్షణకు పాధ్రాన్యత ఇవ్వాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ వేణుగోపాల్‌రావు, ఎస్‌ఐ రాఘవేందర్‌ మంగళవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని నగరంలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిధిలోని శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఎమ్మెల్యేకు వివరించారు. గ్రామాల్లో సైబర్‌ క్రైంపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.

బీజాపూర్‌ హైవే నిర్మాణంలో ప్రభుత్వాలు విఫలం

చేవెళ్ల: హైదరాబాద్‌– బీజాపూర్‌ జాతీయ రహదారిని నిర్మించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దారుణంగా విఫలమయ్యాయని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన చేవెళ్లలో విలేకరులతో మాట్లాడుతూ.. నేషనల్‌ హైవే, ఆర్‌అండ్‌బీ అధికారులు ఎన్‌జీటీ కోర్టుకు తప్పుడు నివేదిక అందించారని, ఈ కారణంగానే పనులను ఆపేయాలని న్యాయస్థానం ఆదేశించిందని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది ముమ్మాటికీ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ధ్వజమెత్తారు. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి హైదరాబాద్‌– బీజాపూర్‌ హైవేను పూర్తి చేసేలా చొరవ చూపాలని కోరారు. లేదంటే ప్రజలను ఏకం చేసి ఉద్యమం చేపడుతామని స్పష్టంచేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు పి.ప్రభాకర్‌, నాయకులు మాధవగౌడ్‌, తులసీరాజు, ఎల్లయ్య, విగ్నేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి సీతక్కను కలిసిన  అధికారుల బృందం   1
1/1

మంత్రి సీతక్కను కలిసిన అధికారుల బృందం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement