మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టిన కారు | - | Sakshi
Sakshi News home page

మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టిన కారు

Dec 26 2023 5:04 AM | Updated on Dec 26 2023 12:45 PM

- - Sakshi

రంగారెడ్డి: మోటార్‌ సైకిల్‌ను కారు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం చౌదరిగూడ గ్రా మానికి చెందిన చంద్రశేఖర్‌, క్రాంతికుమార్‌ మో టార్‌ సైకిల్‌పై షాద్‌నగర్‌ నుంచి చౌదరిగూడకు వెళ్తుండగా శ్రీరంగాపూర్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఎదురుగా వస్తున్న కారు మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టింది.

దీంతో చంద్రశేఖర్‌, క్రాంతికుమార్‌లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు చికిత్స కోసం షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రశేఖర్‌ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య పూజితతో పాటు మూడు నెలల పాప ఉంది. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు.

స్థానికులు, కుటుంబ సభ్యుల ఆందోళన
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు, కుటుంబ సభ్యులు సోమవారం మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి రాస్తారోకో చేశారు. దాదాపు అరగంట పాటు రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ లక్ష్మీరెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కారు కొత్తూర్‌కు చెందిన నర్సింలుకు సంబంధించినదని విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement