పశువులకు గాలికుంటు నివారణ టీకాలు | - | Sakshi
Sakshi News home page

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

Oct 15 2025 5:38 AM | Updated on Oct 15 2025 5:38 AM

పశువులకు గాలికుంటు  నివారణ టీకాలు

పశువులకు గాలికుంటు నివారణ టీకాలు

సిరిసిల్ల: జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను బుధవారం నుంచి ఇవ్వనున్నట్లు జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాలోని 95వేల పశువులకు టీకాలు వేస్తామని పేర్కొన్నారు. ఏటా ప్రభుత్వం పశువులకు రెండుసార్లు ఈ టీకాలు ఉచితంగా వేస్తుందని వివరించారు. జిల్లాలోని 13 మండలాల్లో 19 బృందాలు క్షేత్రస్థాయిలో ఈ టీకాలు వేస్తాయన్నారు. కోనరావుపేట మండలం పల్లిమక్తలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ ఎం.హరిత పశువులకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. జిల్లాలోని పశువుల యజమానులు తమ జీవాలకు టీకాలు వేయించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement