
రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ..
● రెండు, మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు ● షెడ్యూల్ విడుదల చేసిన కలెక్టర్ హరిత
సిరిసిల్ల: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను కలెక్టర్ ఎం.హరిత మంగళవారం విడుదల చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామపంచాయతీ ఎన్నికలు రెండు, మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం ఎంపీటీసీ 123, జెడ్పీటీసీ 12 స్థానాలు ఉన్నాయని వెల్లడించారు. మొత్తం 260 గ్రామపంచాయతీలు, 2,268 వార్డులు ఉన్నాయని తెలిపారు.
● మొదటి విడతలో ఎన్నికలు జరిగే
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు
బోయినపల్లి, 11 స్థానాలు, 60 పోలింగ్ కేంద్రాలు. చందుర్తి, 10 స్థానాలు, 54 పోలింగ్ కేంద్రాలు. రుద్రంగి 5 స్థానాలు, 27 పోలింగ్ కేంద్రాలు. వేములవాడ అర్బన్ 6 స్థానాలు, 36 పోలింగ్ కేంద్రాలు. వేములవాడ రూరల్ 7 స్థానాలు, 40 పోలింగ్ కేంద్రాలు. కోనరావుపేట 12 స్థానాలు, 70 పోలింగ్ కేంద్రాలు. ఇల్లంతకుంట 14 స్థానాలు, 90 పోలింగ్ కేంద్రాలు. మొత్తం 65 స్థానాలు, 377 పోలింగ్ కేంద్రాలు.
● రెండో విడతలో
ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు
– తంగళ్ళపల్లి 14 స్థానాలు, 77 పోలింగ్ కేంద్రాలు. ఎల్లారెడ్డిపేట 13 స్థానాలు, 85 పోలింగ్ కేంద్రాలు. వీర్నపల్లి 5 స్థానాలు, 26 పోలింగ్ కేంద్రాలు. ముస్తాబాద్ 13 స్థానాలు, 75 పోలింగ్ కేంద్రాలు. గంభీరావుపేట 13 స్థానాలు, 69 పోలింగ్ కేంద్రాలు. మొత్తం 58 స్థానాలు, 332 పోలింగ్ కేంద్రాలు.
● రెండో విడతలో నిర్వహించే జీపీ స్థానాలు
– గంభీరావుపేట జీపీలు 22, పోలింగ్ కేంద్రాలు 202. ముస్తాబాద్ జీపీలు 22, పోలింగ్ కేంద్రాలు 202. తంగళ్ళపల్లి జీపీ 30, పోలింగ్ కేంద్రాలు 2 52. ఇల్లంతకుంట జీపీ 35, పోలింగ్ కేంద్రాలు 294. కోనరావుపేట జీపీ 28, పోలింగ్ కేంద్రాలు 238. మొత్తం 137 జీపీ, 1188 పోలింగ్ కేంద్రాలు.
● మూడో విడతలో
నిర్వహించే జీపీ స్థానాలు
– వేములవాడ అర్బన్ జీపీలు 11, పోలింగ్కేంద్రాలు 104. రుద్రంగి జీపీలు 10, పోలింగ్ కేంద్రాలు 86. చందుర్తి జీపీలు 19, పోలింగ్కేంద్రాలు 174. వేములవాడ రూరల్ జీపీలు 17, పోలింగ్ కేంద్రాలు 146. బోయినపల్లి జీపీలు 23, పోలింగ్ కేంద్రాలు 212. వీర్నపల్లి జీపీలు 17, పోలింగ్ కేంద్రాలు 132. ఎల్లారెడ్డిపేట జీపీలు 26, పోలింగ్ కేంద్రాలు 226. మొత్తం 123 జీపీలు, 1,080 పోలింగ్ కేంద్రాలు.