
మహిళలు అంచనాకు మించి శ్రమించారు
● కోటీశ్వరులను చేయడమే లక్ష్యం ● ధాన్యం సేకరణలో రికార్డు ● కలెక్టర్ సందీప్కుమార్ ఝా
సిరిసిల్ల: జిల్లాలో మహిళలు అంచనాకు మించి శ్రమించి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేశారని, రికార్డు స్థాయిలో సేకరించారని కలెక్టర్ సందీప్కుమార్ ఝా కొనియాడారు. కలెక్టరేట్లో సోమవారం మహిళా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. జిల్లాలో గతంలో మహిళలు 42 కేంద్రాల్లోనే ధాన్యం సేకరించేవారని, వాటిని 190కి పెంచామన్నారు. ఈ యాసంగి సీజన్లో మహిళలకు రూ.7కోట్ల మేరకు ధాన్యం కమీషన్ వచ్చిందని తెలిపారు. వచ్చే సీజన్లో 220 కొనుగోలు కేంద్రాలను కేటాయిస్తామని ప్రకటించారు. ప్రతీ మండలంలో రెండు విత్తన, ఎరువుల దుకాణాలను మహిళలకు మంజూరు చేస్తామని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ను మహిళలు సత్కరించారు. ధాన్యం సేకరణలో బాగా పనిచేసిన మహిళలను కలెక్టర్ సన్మానించారు. డీఆర్డీవో శేషాద్రి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ పి.రజిత, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్బేగం, అదనపు డీఆర్డీవో గొట్టె శ్రీనివాస్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎల్.భాగ్య, డీపీఎం శ్రీనివాస్ పాల్గొన్నారు.
కలెక్టరేట్లో జిరాక్స్ సెంటర్
కలెక్టరేట్కు వచ్చే ప్రజలకు జిరాక్స్ సెంటర్ అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కలెక్టర్ ఇందిరా మహిళా శక్తిలో భాగంగా శ్రీరాజరాజేశ్వర మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేయించారు. మహిళా సంఘాల ప్రతినిధులతో కలిసి సోమవారం ప్రారంభించారు.
కోడెలను వ్యవసాయ పనులకే వినియోగించాలి
వేములవాడఅర్బన్: రాజన్న గోశాలలో పంపి ణీ చేసే కోడెలను రైతులు వ్యవసాయ పనులకే ఉపయోగించాలని కలెక్టర్ సందీప్కుమార్ ఝా సూచించారు. దరఖాస్తు చేసుకున్న రైతులకు 200 కోడెలను సోమవారం పంపిణీ చేశా రు. కోడెలను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయ ఈ వో వినోద్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం పాల్గొన్నారు.