
మట్టి తవ్వకాలపై విచారణ
● అక్రమ మైనింగ్పై కలెక్టర్కు నివేదిక
ముస్తాబాద్(సిరిసిల్ల): నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని భూగర్భ గనులశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ క్రాంతికుమార్ హెచ్చరించారు. ముస్తాబాద్ మండలం పోతుగల్లో పంట పొలాల నుంచి అక్రమంగా మట్టి తరలింపుపై ఏడీ క్రాంతి సోమవారం విచారణ చేపట్టారు. చేనులో తీసిన మట్టి కొలతలను తీసుకోవడం జరిగిందని వి వరించారు. ఎంతమేరకు మట్టిని తవ్వి తీశారో విచారణ చేయనున్నట్లు తెలిపారు. అనుమతులు పొందకుండా భారీ యంత్రాలతో మట్టిని తరలించినట్లు పేర్కొన్నారు. ఇటుకబట్టి పరిశ్రమలకు మట్టిని తరలించారన్నారు. మట్టి తరలింపు కొలతలు, నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్కు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటాచి వాహనాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నామని ఆర్ఐ రఘు తెలిపారు.
కెనాల్లో మట్టి తొలగింపు
ముస్తాబాద్ మండలం పోతుగల్లో మానేరు కెనాల్లో మట్టి వేసి రోడ్డు వేయించిన విషయంపై సోమవారం క్షేత్రస్థాయిలో విచారణ చే శామని డీఈ రవికుమార్ తెలిపారు. కెనాల్లో మట్టివేసి రోడ్డుగా ఉపయోగించుకున్నారని, దీనిపై ఏఈ వంశీకృష్ణ విచారణ చేశారన్నారు. కెనాల్లో మట్టిని వేసిన వ్యక్తుల ఆధ్వర్యంలో యంత్రాలతో తీయించినట్లు తెలిపారు. మరో సారి ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొత్త పంచాయతీలతో అభివృద్ధి
● ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): కొత్త గ్రామపంచాయతీలతో అభివృద్ధి జరుగుతుందని ఏఎంసీ చైర్మన్ సాబేరా బేగం పేర్కొన్నారు. మండలంలోని బాకూర్పల్లి, సేవాలాల్తండా నూతన గ్రామపంచాయతీలను సోమవారం అధికారులతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. చిన్న పంచాయతీలను అభివృద్ధి చేసుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. జీపీ భవనం కోసం రూ.20 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఎంపీడీవో సత్తయ్య, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహరి, సింగిల్విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చీటీ లక్ష్మణ్రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ వైస్చైర్మన్ గుండాడి రాంరెడ్డి, అందె సుభాష్ పాల్గొన్నారు.
హద్దులు నిర్ణయించండి
ఇల్లంతకుంట(మానకొండూర్): అటవీ అధికా రులు తమ భూముల్లో సూచికలు ఏర్పాటు చేస్తున్నారని.. హద్దులు నిర్ణయించాలని కోరుతూ మండలంలోని అనంతారం గ్రామ రైతులు సోమవారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. తహసీల్దార్ ఫారుక్, ఫారెస్ట్ రేంజ్ అధికారి వచ్చి రైతులతో మాట్లాడారు. రెవె న్యూ, ఫారెస్ట్ అధికారులు కలిసి సరిహద్దులు నిర్ణయిస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. అక్కెం నాగరాజు, ఎల్లయ్య, ప్రభాకర్, నరేందర్, తిరుపతి, మల్లేశం, దేవయ్య, హరీశ్ ధర్నాలో పాల్గొన్నారు.
శిక్షణతో కళలకు జీవం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అంతరించి పోతున్న కళలను కాపాడుకునేందుకు పిల్లలకు తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నట్లు భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, మ్యూజిక్ అకాడమీ చైర్మన్ అందె భాస్కర్ తెలిపారు. మండలంలోని రాజన్నపేటలో 20 రోజులపాటు కొనసాగిన శిక్షణ శిబిరం సోమవారం ముగిసింది. కోలా టం, జడకొప్పు, చెక్కభజనలపై శిక్షణ ఇచ్చా రు. మాజీ సర్పంచ్ ముక్క శంకర్, మాజీ ఎంపీటీసీ నమిలికొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

మట్టి తవ్వకాలపై విచారణ

మట్టి తవ్వకాలపై విచారణ

మట్టి తవ్వకాలపై విచారణ

మట్టి తవ్వకాలపై విచారణ