
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి(వేములవాడ): పేదల సంక్షేమమే ప్రభు త్వ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. చందుర్తిలోని రైతువేదికలో 89 మందికి మంజూ రైన రూ.29.33లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను సోమవారం పంపిణీ చేశారు. విప్ శ్రీనివాస్ మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడిన ఈ ప్రాంతంలోని నిరుపేదలు వైద్యం చే యించుకునేందుకు రూ.20కోట్ల ఎల్వోసీలు అందజేసినట్లు తెలిపారు. పేదల వైద్యం కోసం గత ప్రభుత్వం పదేళ్లలో రూ.400కోట్లు ఖర్చు పెడితే తమ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.800 కోట్లు వెచ్చించిందని తెలిపారు. మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, పార్టీ మండలాధ్యక్షు డు చింతపంటి రామస్వామి, నాయకులు భీంరా జు కనకరాజు, ఏనుగు లచ్చిరెడ్డి, పులి సత్తయ్య, ఈసరి శ్రీనివాస్, సంటి ప్రసాద్ పాల్గొన్నారు.
కోనరావుపేట(వేములవాడ): ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదలకు వరమని విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండల పరిషత్లో సోమవారం 56 మందికి రూ.18.37 లక్షల విలువైన సీఎమ్మార్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు షేక్ ఫిరోజ్పాషా, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్చైర్మన్ ప్రభాకర్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు కేతిరెడ్డి జగన్మోహన్రెడ్డి, బొర్ర రవి, చేపూరి గంగాధర్, కార్తీక్, గొట్టె రుక్మిణి పాల్గొన్నారు.