నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

Jun 12 2025 3:37 AM | Updated on Jun 12 2025 3:37 AM

నకిలీ విత్తనాలు    విక్రయిస్తే చర్యలు

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

చందుర్తి(వేములవాడ): మండలంలో చందుర్తి, మర్రిగడ్డలోని ఫర్టిలైజర్స్‌, విత్తనాల దుకా ణాలపై వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు బుధవారం దాడులు చేశారు. పత్తి విత్తనాలతోపాటు వరి ధాన్యం విత్తనాల సంచులను పరిశీలించారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని చందుర్తి, కోనరావుపేట వ్యవసాయాధికారులు అనూష, సందీప్‌, ఎస్సై రమేశ్‌ హెచ్చరించారు. స్టాక్‌ వివరాలు బోర్డుపై నమోదు చేయాలని సూచించారు.

ఏబీవీపీ నాయకుల నిరసన

సిరిసిల్లటౌన్‌: జిల్లాలో కార్పొరేట్‌ విద్యాసంస్థలో జరుగుతున్న దోపిడీని అరికట్టడంలో అధికారులు మీనమేశాలు లెక్కిస్తున్నారని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో బుధవారం ధర్నాకు దిగారు. అక్రమంగా బుక్స్‌ అమ్ముతున్నారని ఎంఈవోకు సమాచారం ఇచ్చామన్నారు. ఏబీవీపీ డిస్ట్రిక్ట్‌ కన్వీనర్‌ లోపెళ్లి రాజురావు, టౌన్‌ జాయింట్‌ సెక్రెటరీ రుద్రవీణ, ధనుష్‌, పూజా, కార్తీక్‌ పాల్గొన్నారు.

ఆరోపణలు సరికావు

ఏబీవీపీ నేతలు విద్యాశాఖ అధికారులపై చేసిన ఆరోపణలు సరికాదని సిరిసిల్ల ఎంఈవో దూస రఘుపతి తెలిపారు. విద్యాసంస్థకు వెళ్లి చూడగా పుస్తకాలు ఏమీ దొరకలేవన్నారు. విద్యాసంస్థకు చెందిన పుస్తకాలు బయట అ మ్ముతున్నారని వాటికి ట్రేడ్‌లైసెన్స్‌ ఉన్నట్లు తెలిపారు.

‘కేశవరావు మృతిపై విచారణ జరపాలి’

ఇల్లంతకుంట(మానకొండూర్‌): కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానాలు వీడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు కోరారు. మండలకేంద్రంలో బుధవారం జరిగిన 13వ మండల మహాసభలో పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో ఆపరేషన్‌ కగార్‌ పేరిట వందలాది మందిని పొట్టన పెట్టుకుంటున్నారని ఆరోపించారు. సీపీఐ ఎంఎల్‌ మావోయిస్టు పార్టీ అఖిలభారత ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు హత్యపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని కోరారు జిల్లా కార్యవర్గ సభ్యులు మంద సుదర్శన్‌, బోడ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌, తిరుపతిరెడ్డి, మంద అనిల్‌ కుమార్‌, ఆదిత్య, విష్ణు, రాజు, అఖిల్‌ పాల్గొన్నారు.

16న జిల్లా 4 మహాసభలు

ఈనెల 16న జిల్లా నాలుగో మహాసభలు జరగనున్నట్టు సీపీఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు తెలిపారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కోణంనేని సాంబశివరావు జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పాల్గొంటారన్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

వేములవాడ: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని శిక్షకుడు కృష్ణ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం 20వ వార్డు ముదిరాజ్‌ సంఘ భవనంలో శిక్షణనిచ్చారు. యోగాతో ఒత్తిడి దూరమై ప్రశాంతత లభిస్తుందన్నారు. డీపీఎం తిరుపతి, రిషిక, ఆశావర్కర్లు లత, హేమలత, ఉమా, విజయలక్ష్మి, జయశీల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement