
సకాలంలో ఇళ్లు పూర్తి చేయాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తిచేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి వంగ గిరిధర్రెడ్డి కోరారు. మండల కేంద్రంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. గిరిధర్రెడ్డి మాట్లాడుతూ.. ఇసుక, ఇతర సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు, నాయకులు నంది కిషన్, అంతర్పుల గోపాల్, ద్యాగ లక్ష్మీనారాయణ, ఎడ్ల రాజుకుమార్, గుర్రపు రాములు, పందిర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.