రాజన్న ఆలయ ఈవోగా రాధాభాయి | - | Sakshi
Sakshi News home page

రాజన్న ఆలయ ఈవోగా రాధాభాయి

Jun 14 2025 10:16 AM | Updated on Jun 14 2025 10:16 AM

రాజన్

రాజన్న ఆలయ ఈవోగా రాధాభాయి

● ఆలయంలో పూజలు.. బాధ్యతల స్వీకరణ

వేములవాడ: రాజన్న ఆలయ ఈవోగా ఆర్డీవో రాధాభాయిని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. ఇక్కడ పనిచేస్తున్న ఈవో కొప్పుల వినోద్‌రెడ్డిని హైదరాబాద్‌ డీసీగా బదిలీ చేశారు. ఈవోగా రాధాభాయి శుక్రవారం బాధ్యతలు స్వీకరించి, రాజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించారు. ఏఈవో బి.శ్రీనివాస్‌ ప్రసాదాలు అందించారు.

రోడ్డు ఆక్రమిత నిర్మాణాలు కూల్చివేత

సిరిసిల్లటౌన్‌: రోడ్డు ఆక్రమిత నిర్మాణాలపై సిరిసిల్ల బల్దియా చర్యలు చేపట్టింది. శుక్రవారం స్థానిక మార్కెట్‌ ఏరియాలోని పలు దుకాణాల ముందున్న గద్దెలు రోడ్డు ఆక్రమించి నిర్మించారన్న ఫిర్యాదుపై మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ పోసు వాణి ఆదేశాలతో అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. స్థానిక బాలాజీ స్వీట్‌హౌస్‌ పక్క సందిలో రోడ్డుపై నిర్మించిన గద్దెలను జేసీబీ సాయంతో టీపీబీవో గణేశ్‌, నయీం, సిబ్బంది సహకారంతో కూల్చివేతలు చేపట్టారు. కాగా సదరు ఇళ్ల యజమానులే స్వతహాగా తొలగించుకుంటామని హామీ ఇవ్వడంతో అధికారులు వెనుదిరిగారు.

రాజన్న ఆలయ ఈవోగా రాధాభాయి
1
1/1

రాజన్న ఆలయ ఈవోగా రాధాభాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement