రోడ్డు విస్తరణ నిర్వాసితులకు పరిహారం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు విస్తరణ నిర్వాసితులకు పరిహారం

Jun 14 2025 10:16 AM | Updated on Jun 14 2025 10:16 AM

రోడ్డు విస్తరణ నిర్వాసితులకు పరిహారం

రోడ్డు విస్తరణ నిర్వాసితులకు పరిహారం

● వేములవాడలో 40 మందికి చెక్కులు అందజేత

వేములవాడ: పట్టణంలోని ప్రధాన రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రాధాభాయి శుక్రవారం పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. తిప్పాపూర్‌ బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు చేపట్టే రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న 40 మంది నిర్వాసితులకు శుక్రవారం కలెక్టరేట్‌లో చెక్కులు పంపిణీ చేశారు. రోడ్డు విస్తరణలో 343 మంది భూములు కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అధికారులు దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు అంటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement