
పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు
వేములవాడఅర్బన్: కోడెల సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ సందీప్కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానం తిప్పాపూర్లోని గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు పరిశీలించి, అర్హులకు 50 జతల కోడెలు శుక్రవారం పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 750 కోడెలను రైతులకు అందజేసినట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రవీందర్రెడ్డి, గోశాల కమిటీ సభ్యులు రాధా కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
● కలెక్టర్ సందీప్కుమార్ ఝా