
నేడు జాతీయ లోక్అదాలత్
సిరిసిల్లకల్చరల్: పెండింగ్ కేసుల పరిష్కారం కోసం శనివారం మెగా జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు. పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకోదగిన కేసులను అదాలత్లో పరిష్కరించుకోవాలని సూచించారు. వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని న్యాయవాదులకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడఅర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం అంగన్వాడీ విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించారు. రుద్రంగిలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కనికరపు రాకేశ్, మండల విద్యాధికారి బన్నాజీ తదితరులు పాల్గొన్నారు.
నాణ్యమైన సేవలందించాలి
● జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం
గంభీరావుపేట(సిరిసిల్ల): అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన పౌష్టికాహారంతోపాటు ఆట పాటలతో కూడిన విద్యనందించాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం కోరారు. మండలంలోని లింగన్నపేట ఐసీడీఎస్ సెక్టార్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్నారుల్లో పోషకాహార లోపం నివారించేందుకు సరైన పౌష్టికాహారం అందించాలన్నారు. డీహబ్ కో–ఆర్డినేటర్ రోజా, డీసీపీయూ ప్రొటెక్షన్ అధికారి శ్రీనివాస్, టీచర్లు గీతబాల, వనజ, రజని, ఉమారాణి, సునీత పాల్గొన్నారు.
మహిళలు పరీక్షలు చేయించుకోవాలి
● జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్ల: జిల్లాలో స్వశక్తి సంఘాల మహిళలు, మున్సిపల్లో పనిచేసే మహిళా సిబ్బంది విధిగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. సుందరయ్యనగర్, అంబేడ్కర్నగర్, వేములవాడలోని ఆరోగ్య కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. డీఎంహెచ్వో మాట్లాడుతూ మహిళలకు ఉచితంగా స్క్రీనింగ్ హెల్త్క్యాంప్లను నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, నోటి క్యాన్సర్, దీర్ఘకాల వ్యాధుల(మధుమేహం, రక్తపోటు) పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్ రామకృష్ణ, డీపీవో రాజేందర్, పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ ఉద్యోగులకు గుండె వైద్యశిబిరం
సిరిసిల్లటౌన్: మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు, సిబ్బందికి శుక్రవారం ఉచిత గుండె వైద్యశిబిరం నిర్వహించారు. స్థానిక సినారె కళామందిరంలో నిర్వహించిన కార్యక్రమాన్ని ఇన్చార్జి కమిషనర్ పోసు వాణి ప్రారంభించారు. కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో 220 మంది ఉద్యోగులు, కార్మికులకు ఉచితంగా టూడీ ఈకో, షుగర్, బీపీ పరీక్షలు చేశారు. ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ ఆరోగ్యంగా జీవించడానికి వైద్యుల సలహాలు పాటించాలన్నారు. మున్సిపల్ ఈఈ రఘు, మెప్మా కోఆర్డినేటర్ మహాలక్ష్మి, ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

నేడు జాతీయ లోక్అదాలత్

నేడు జాతీయ లోక్అదాలత్

నేడు జాతీయ లోక్అదాలత్