క్షయపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

క్షయపై అవగాహన

Jun 13 2025 5:03 AM | Updated on Jun 13 2025 5:03 AM

క్షయపై అవగాహన

క్షయపై అవగాహన

గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని దమ్మన్నపేటలో గురువారం టీబీ ముక్త్‌ భారత్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా క్షయవ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. దీర్ఘకాలిక వ్యాధులు, పొగాకు తీసుకునే వారిలో క్షయవ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉంటాయన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, జ్వరం, ఆకలి లేకపోవడం, రాత్రిపూట చెమటలు పట్టడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉన్న వారు తెమడ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి వేణుగోపాల్‌రెడ్డి, సీహెచ్‌వో రమేశ్‌, టీబీ సూపర్‌వైజర్‌ మహిపాల్‌, వైద్యసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement