
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ద్విచక్రవాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు. జిల్లెల్లకు చెందిన కోడూరి దశరథంగౌడ్ (55) మంగళవారం రాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా రామచంద్రాపూర్కు చెందిన గంధం పర్శరాములు బైక్పై వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. దశరథంను కరీంనగర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికి త్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడికి భార్య వెంకటవ్వ, కొడుకులు అరవింద్, అరుణ్ ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు.