
పచ్చనిగుట్టల్లో ‘చెత్త’మంటలు
● కలెక్టర్ నివాసం పక్కనే కాలుష్యకాసారం
సిరిసిల్ల: తడి, పొడి చెత్తను వేరు చేసి.. తడి చెత్తతో సేంద్రియ ఎరువులు, పొడి చెత్తను విద్యుత్ ఉత్పత్తికి పంపించాల్సి ఉండగా.. సిరిసిల్ల మున్సిపల్ అ ధికారులు చెత్తమంటలు రేపుతున్నారు. సిరిసిల్లలో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు. ఆ చెత్తను డంపుయార్డులో విభజించాలి. కానీ పొడిచెత్తను కాలబెడుతూ.. వాయుకా లుష్యానికి కారణమవుతున్నారు. మున్సిపల్ చె త్తను డంపుయార్డులో కాలబెట్టవద్దని ఉన్నతాధికా రులు చెప్పినా క్షేత్రస్థాయి సిబ్బంది నిప్పుపెడుతూ నే ఉన్నారు. గుట్టల్లో గుట్టుగా చెత్తమంటలు అంటిస్తున్నారు. ఇలా డంపుయార్డు నుంచి సోమవారం నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. పచ్చనిగుట్టల్లో చెత్తమంటలతో వాయుకాలుష్యం ఏర్పడుతుంది. గతంలో చెత్తను కాల్చవద్దని హెచ్చరిస్తూ డంపుయార్డు బాధ్యతలు నిర్వహించే శానిటరీ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేయడంతో కొంతకాలం చెత్తమంటలు ఆగిపోయాయి. కానీ ఇటీవల డంపుయార్డు నుంచి పొగలు వస్తున్నాయి. కలెక్టర్ నివాసం సమీపంలోనే డంపుయార్డు ఉంది. ఆ పొగంతా కలెక్టరేట్ ప్రాంతంలో వ్యాపిస్తుంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పొడి చెత్తను కాల్చి వేయకుండా.. డంపుయార్డు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.