
అనుమతి లేని ఆస్పత్రికి జరిమానా, నోటీస్
సిరిసిల్ల: జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రులపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మంగళవారం అకస్మికంగా దాడులు నిర్వహించారు. అనుమతి లేని ఆస్పత్రులకు జరి మానా విధించి, సంజాయిషీ నోటీసులను జారీ చేసినట్లు జిల్లా వైద్యాధికారి రజిత తెలిపారు. విధిగా ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలని, లేకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఆరోగ్య పథకాల లక్ష్యాలు సాధించాలి
జిల్లాలో ఆరోగ్య పథకాల లక్ష్యాలను సాధించాలని డీఎంహెచ్వో రజిత అన్నారు. కలెక్టరేట్లోని వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సూపర్వైజర్లు(సీహెచ్వో), ఎంపీహెచ్ఎస్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గర్భిణుల నమోదు, సకాలంలో అన్ని పరీక్షలు చేసి మాతృ, శిశు మరణాలు తగ్గించాలన్నారు. వర్షాకాల వ్యాధులపై జాగ్రత్తలు వివరించారు. డిప్యూటీ డీఎంహెచ్వో అంజలి ఆల్ఫ్రెడ్, డీఐవో సంపత్కుమార్, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అనిత, రామకృష్ణ, డిప్యూటీ డెమో రాజ్కుమార్, సీహెచ్వో శాంత, హెచ్ఈ బాలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.