రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు | - | Sakshi
Sakshi News home page

రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు

Jun 11 2025 11:50 AM | Updated on Jun 11 2025 11:50 AM

రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు

రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు

వేములవాడ: ప్రజాప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే వేములవాడ నియోజకవర్గంలో రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని 7,8,11,12వ వార్డుల్లో రూ.3 కోట్లతో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇతర పనులకు కమిషనర్‌ అన్వేశ్‌, సెస్‌ డైరెక్టర్‌ నామాల ఉమ, ఏఎంసీ చైర్మన్‌ రొండు రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ, ఎన్నికల ముందు వేములవాడను టెంపుల్‌ సిటీగా మార్చుతామని చెప్పిన మాటకు కట్టుబడి ప్రణాళికలు రూపొందించుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.76 కోట్లతో త్వరలోనే టెండర్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

సోషల్‌ మీడియా షార్ప్‌గా పని చేయాలి

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు సోషల్‌ మీడియా బాధ్యులు షార్ప్‌గా పని చేయాలని విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ గ్రాండ్‌లో జరిగిన నియోజకవర్గ సోషల్‌ మీడియా సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఎమ్మెల్యేగా తాను గెలవడంలో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా వారియర్స్‌ పాత్ర కీలకమైందన్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేందుకు మరింత స్పీడ్‌గా పని చేయాలని సూచించారు. సోషల్‌ మీడియా నియోజకవర్గ ఇన్‌చార్జి బొజ్జ మల్లేశ్‌, జిల్లా కోకన్వీనర్‌ కనికరపు రాకేశ్‌, పట్టణ కన్వీనర్‌ ఎర్ర శ్రావణ్‌, నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు న్యాత నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement