
ఆది దేవునికి అభిషేకాలు
వేములవాడ: వేములవాడ రాజన్నను మంగళవారం 20 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో వివిధ ప్రాంతాలకు చెందినవారు తరలివచ్చి రాజన్నకు అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణాలు, సత్యనారాయణవ్రతాలు, అమ్మవారికి కుంకుమపూజ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల ద్వారా రూ.25 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
అవెలబుల్ స్కూళ్లలో గిరిజన విద్యార్థులకు ఐదు సీట్లు
సిరిసిల్లకల్చరల్: జిల్లాలోని బెస్ట్ అవెలబుల్ స్కూళ్లలో గిరిజన విద్యార్థులకు ఐదు సీట్లు కేటాయించినట్లు కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. జిల్లావాసులై ఉండి వార్షికాదా యం పట్టణాల్లో రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 17న సాయంత్రం 5 గంటలలోపు కరీంనగర్లోని జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలన్నారు. మూడో తరగతిలో లంబాడ బాలురకు ఒకటి, బాలికలకు ఒకటి, ఎరుకల బాలురకు ఒకటి, ఐదో తరగతిలో లంబాడ బాలురకు ఒకటి, 8వ తరగతిలో లంబాడా బాలికలకు ఒకటి చొప్పున సీట్లు ఉ న్నాయన్నారు. కులం, ఆదాయ ధ్రువ పత్రాలు, ఆధార్, సంబంధిత పాఠశాల స్టడీ సర్టి ఫికెట్లు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేసి దరఖాస్తులు అందజేయాలన్నారు. ఈనె ల 20న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని, మరిన్ని వివరాలకు 96521 188 67 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
ఇసుక కొరత లేకుండా చూడాలి
సిరిసిల్లటౌన్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఏర్పడిన కృత్రిమ ఇసుక కొరతను తగ్గించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ కోరారు. మంగళవారం పార్టీ ఆఫీసులో మాట్లాడారు. ఇందిరమ్మ పథకంలో సిరిసిల్ల పట్టణంలో 700పైగా ఇళ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఒకేసారి అందరూ నిర్మాణం ప్రారంభించడం వల్ల ఇసుక కొరత నెలకొందన్నారు. ఇదే అదునుగా కొంతమంది అక్రమంగా ఇసుక రవాణా చేసేవారు ఒక ట్రాక్టర్ ధర రూ.1,500 నుంచి రూ.4 వేలకు పెంచారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందిరమ్మ లబ్ధిదారులకు సరిపడా ఇసుకను ప్రభుత్వం నిర్ణీత ధరలకే అందించాలని లేకుంటే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సీపీఎం కార్యదర్శి వర్గ సభ్యుడు కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, మల్లారం ప్రశాంత్, మిట్టపల్లి రాజమల్లు పాల్గొన్నారు.
వేములవాడలో హిందూ సమ్మేళనం
వేములవాడ: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని పద్మశాలీ సంఘంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు మాట్లాడుతూ, వేములవాడ రాజన్న ఆలయం, పట్టణాభివృద్ధి పనుల దృష్ట్యా నెలకొన్న పరిణామాలు, చేయవలసిన పనులు ఆగమశాస్త్రం ప్రకారం చేసేలా హిందూ సంఘాలు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. హిందూ ఆలయాల పరిషత్ అధ్యక్షుడు రవీందర్గౌడ్, ఎస్సీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు అమరప్రసాద్, శివశక్తి కళ్యాణ్, సీనియర్ స్వయంసేవక్ మదన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యలపై పోరాటం
సిరిసిల్లటౌన్: ప్రజా సమస్యల పరిష్కారంలో సీపీఐ నిరంతర పోరాటాలు చేస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. మంగళవారం కార్మిక భవనంలో మాట్లాడారు. ఈ నెల 16న స్థానిక లహరి ఫంక్షన్హాల్లో సీపీఐ నాల్గో జిల్లా మహాసభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మహాసభలకు అన్ని వర్గాల ప్రజలు పెద్దెత్తున హాజరుకావాలని కోరారు. కార్యవర్గ సభ్యులు పంతం రవి, కడారి రాములు, నాయకులు పాల్గొన్నారు.

ఆది దేవునికి అభిషేకాలు

ఆది దేవునికి అభిషేకాలు