మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలి

Mar 9 2025 1:39 AM | Updated on Mar 9 2025 1:36 AM

వేములవాడ: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించుకోవాలని వేములవాడ జడ్జి జ్యోతిర్మయి కోరా రు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కోర్టుహాలులో శనివారం మహిళా న్యాయవాదులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. జడ్జి మాట్లాడుతూ బాలికలు చదువులపై ఆసక్తి పెంచుకుని అన్ని రంగాల్లో ముందుండాలని సూచించారు. మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించినప్పుడే ఎవరిపై ఆధారపడాల్సిన అవసరం ఉండబోదన్నారు. మహిళా న్యాయవాదులు అన్నపూర్ణ, సుజాత, నయీమానాసరి, పద్మ, సరిత, పావని, కోర్టు సిబ్బంది జయ, జగ్మాదాదేవి, జోష్న, కవిత, లత ఉన్నారు.

వేములవాడ జడ్జి జ్యోతిర్మయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement