ఆక్వా రైతులను కాపాడాలి | - | Sakshi
Sakshi News home page

ఆక్వా రైతులను కాపాడాలి

Sep 6 2025 7:09 AM | Updated on Sep 6 2025 7:09 AM

ఆక్వా రైతులను కాపాడాలి

ఆక్వా రైతులను కాపాడాలి

ఆక్వా రైతులను కాపాడాలి ● రైతు సంఘ జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు

కొత్తపట్నం: సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులను ప్రభుత్వం కాపాడాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో రైతు సంఘ నాయకులు శుక్రవారం మండలంలో ఉన్న రొయ్యల చెరువుల దగ్గరకు వెళ్లి ఆక్వా యజమానులను కలుసుకున్నారు. ఈ నెల 8వ తేదీ ఒంగోలు ఎల్‌బీజీ భవనంలో ‘‘రొయ్యల ఎగుమతులపై అమెరికా ఆంక్షలు – కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత – ప్రత్యామ్నాయ మార్గాలు’’ అనే అంశంపై ఆక్వా రైతుల రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తారని, సమావేశాన్ని ఆక్వా రైతులు జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అమెరికా విధించిన అధిక టారిఫ్‌ల వల్ల రాష్ట్రంలో ఆక్వా రంగంలో ఉన్న రెండున్నర లక్షల రైతులపై ప్రభావం పడుతుందని చెప్పారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి ఎస్‌ స్వామి రెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement