
దగా డీఎస్సీ
ఉపాధ్యాయ లెక్కల్లో తిరకాసులు..
వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన పాఠశాలల ప్రకారం ఉండాల్సిన ఉపాధ్యాయుల వివరాలకు సంబంధించి చేస్తున్న ప్రకటనలు సత్యదూరమని టీచర్ల సంఘాలు విమర్శిస్తున్నాయి. నూతన విద్యా సంవత్సరంలో పాఠశాలలు పునః ప్రారంభమై ఆగస్టు నాటికి విద్యార్థుల సంఖ్య నిర్ధారితమవుతుందని, ఆ ప్రకారం పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల లెక్కతేలుతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటిస్తున్న నూతన విధానం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు బతికి బట్టకట్టే పరిస్థితి లేదని, కేవలం ప్రైవేటు పాఠశాలలకే ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోందని ఆరోపిస్తున్నారు.