● రూ.6.08 లక్షలతో ఉడాయించినట్లు పోలీసులకు ఫిర్యాదు
పామూరు: ప్రభుత్వ మద్యం దుకాణంలోని నగదుతో సేల్స్మన్ ఉడాయించిన సంఘటన బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. మండల కేంద్రమైన పామూరులో నెల్లూరు రోడ్డులోని ఆంధ్రా బ్యాంక్ సమీపంలో 8297 నంబర్ మద్యం దుకాణంలో మోపాడు గ్రామానికి చెందిన షేక్ నాయబ్రసూల్ సేల్స్మన్గా పనిచేస్తున్నాడు. కాగా ఈ నెల 9, 10వ తేదీల్లో మద్యం విక్రయించగా వచ్చిన నగదు 6,08,190 రూపాయలను బ్యాంకులో ప్రభుత్వ ఖాతాకు జమ చేయకుండా పరారయ్యాడు. దీనిపై మార్కాపురం డిపో ఎకై ్సజ్ ఎస్సై పద్మజ పామూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎం.సైదుబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment