18 ఏళ్లకే గుండెపోటుతో మృతి | - | Sakshi
Sakshi News home page

టీ తాగుతూ కుప్పకూలిన యువకుడు

Oct 27 2023 1:28 AM | Updated on Oct 27 2023 9:06 AM

- - Sakshi

అప్పటిదాకా స్నేహితులతో సరదాగా గడిపిన ఆ యువకుడు టీ తాగుదామని హోటల్‌ వద్దకు వెళ్లాడు.

ఒంగోలు టౌన్‌: అప్పటిదాకా స్నేహితులతో సరదాగా గడిపిన ఆ యువకుడు టీ తాగుదామని హోటల్‌ వద్దకు వెళ్లాడు. టీ తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి కుటుంబ సభ్యులు, స్నేహితులు షాక్‌కు గురయ్యారు.

ఒంగోలు మండలంలోని యరజర్ల గ్రామానికి చెందిన చావల మహేష్‌, సుశీల దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మనోజ్‌ వయసు 18 సంవత్సరాలు. ఒంగోలులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఎంఎల్‌టీ చదువుతూ అంజయ్య రోడ్డులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో టీ తాగుదామని స్నేహితులతో కలిసి సమీపంలోని టీస్టాల్‌ వద్దకు వెళ్లాడు.

టీ తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే వైద్యశాలకు తీసుకెళ్లగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. సీపీఆర్‌ చేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇంత చిన్నవయసులో గుండెపోటుతో మరణించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. గురువారం సాయంత్రం యరజర్ల గ్రామంలోని శ్మశాన వాటికలో మనోజ్‌ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement