తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్‌ జగన్‌ | Tiruvuru Counselors Meet YS Jagan | Sakshi
Sakshi News home page

తిరువూరు కౌన్సిలర్లను అభినందించిన వైఎస్‌ జగన్‌

May 21 2025 4:48 PM | Updated on May 22 2025 7:48 AM

Tiruvuru Counselors Meet YS Jagan

వైఎస్ జగన్‌ని కలిసిన తిరువూరు కౌన్సిలర్లు

తమపై టీడీపీ నేతల దాడి, దౌర్జన్యం వివరించిన కౌన్సిలర్లు

కూటమి సర్కార్‌ అరాచకాలను ధీటుగా ఎదుర్కొందామన్న వైఎస్‌ జగన్‌

చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుంది

టీడీపీ నేతలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచినందుకు అభినందనలు

తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తిరువూరు కౌన్సిలర్లు బుధవారం కలిశారు. తిరువూరు నగర పంచాయతీ ఛైర్‌పర్సన్‌ ఎన్నిక సందర్భంగా తమపై టీడీపీ నాయకుల దాడి, దౌర్జన్యం గురించి వైఎస్‌ జగన్‌కు కౌన్సిలర్లు వివరించారు. పోలీసులు, కూటమి నేతలు, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌ రాజ్యాంగ విరుద్దంగా వ్యవహరించిన తీరును పార్టీ నేతలు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మెజారిటీ లేకపోయినా బరితెగించి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను ధీటుగా ఎదుర్కొందామన్నారు. చట్టపరంగా, న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందన్న వైఎస్‌ జగన్‌.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ధైర్యంగా నిలిచినందుకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement