వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలు | TDP leaders joined YSRCP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలు

Aug 30 2023 4:31 AM | Updated on Aug 30 2023 4:31 AM

TDP leaders joined YSRCP - Sakshi

సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లా రాజాంకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, ఆయన తనయుడు డాక్టర్‌ తలే రాజేశ్‌ వైఎస్సార్‌­సీపీలో చేరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వారు కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు పుష్పగుచ్ఛం అందజేశారు.

అనంతరం సీఎం వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా­నించారు. గతంలో పాలకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు (1985, 1994) తలే భద్రయ్య గెలుపొందారు. అలాగే ఏపీపీఎస్సీ సభ్యు­డిగా ఆరేళ్లపాటు పనిచేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బా­రెడ్డి, విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ చిన్న శ్రీను, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.  

అనకాపల్లికి చెందిన పలువురు టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీలోకి..
అనకాపల్లి టీడీపీ నేత మలసాల భరత్‌ కుమార్, ఆ యన తల్లిదండ్రులు రమణారావు (విశాఖ డెయిరీ డైరెక్టర్‌), ధనమ్మ (మాజీ ఎంపీపీ) వైఎస్సార్‌సీపీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకోగా.. వా రికి సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వా­నించారు. భరత్‌ కుమార్‌ కుటుంబంతోపాటు గంగుపాం నాగేశ్వరరావు (మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌), మల సాల కుమార్‌ రాజా (విశాఖ జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి) కూడా పార్టీలో చేరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement