‘చోటే భాయ్‌’ని కాపాడుతున్న ‘బడే భాయ్’.. కేటీఆర్‌ సంచలన ట్వీట్‌ | SLBC Tunnel Incident: KTR Tweet On Revanth And Modi Government | Sakshi
Sakshi News home page

‘చోటే భాయ్‌’ని కాపాడుతున్న ‘బడే భాయ్’.. కేటీఆర్‌ సంచలన ట్వీట్‌

Sep 14 2025 10:00 AM | Updated on Sep 14 2025 10:44 AM

SLBC Tunnel Incident: KTR Tweet On Revanth And Modi Government

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌ఎల్‌బీసీ సొరంగం ఘటన జరిగి 200 రోజులు దాటినా కానీ  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నిప్పులు చెరిగారు. అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరుగురి మృతదేహాలను కూడా వెలికితీయలేకపోయింది. ఇంకా కుటుంబాలకు ఎలాంటి పరిహారం కూడా చెల్లించలేదంటూ ఎక్స్‌ వేదికగా నిలదీశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్నపాటి సమస్యలకే జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందాన్ని పంపించి హంగామా సృష్టించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై దర్యాప్తు చేయడానికి ఎందుకు ఒక్క బృందాన్ని కూడా పంపలేదంటు కేటీఆర్‌ ప్రశ్నించారు. బీజేపీ బడే భాయ్ ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ చోటే భాయ్‌ని కాపాడుతున్నారంటూ దుయ్యబట్టారు.

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన రోజున, ఆ ఆరు కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తాం. ఆ ఆరుగురి ప్రాణాలను బలిగొన్న వారికి శిక్ష పడేలా చేస్తాం. కాంగ్రెస్ విధ్వంసం చేసిన ప్రతి దానితో పాటు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కూలిపోవడానికి గల కారణాలకు మేము సమాధానాలు రాబడతాం’’ అంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement