ఉండేవారు ఉంటారు.. పోయేవారు పోతారు.. బీఎల్‌ సంతోష్‌ షాకింగ్‌ కామెంట్స్‌ | Senior Bjp Leader Bl Santhosh Key Comments | Sakshi
Sakshi News home page

ఉండేవారు ఉంటారు.. పోయేవారు పోతారు.. బీఎల్‌ సంతోష్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Oct 5 2023 7:39 PM | Updated on Oct 5 2023 8:18 PM

Senior Bjp Leader Bl Santhosh Key Comments - Sakshi

ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదని, 30 ఏళ్లుగా ఎలా ఉందో అలానే పార్టీ నడుస్తుందని  బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ఎవరి కోసమో పార్టీ విధానాలు మార్చుకోదని, 30 ఏళ్లుగా ఎలా ఉందో అలానే పార్టీ నడుస్తుందని  బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ అన్నారు. బీజేపీ రాష్ట్ర పధాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల్లో ఇదే విధానంతో అధికారంలోకి వచ్చామన్నారు.

‘‘ పార్టీలో ఉండే వారు ఉంటారు.. పోయే వారు పోతారు. మోదీ-కేసీఆర్ కలిసి ఉంటే ఈ కార్యక్రమాలు ఎందుకు?. అనవసరపు మాటలు తగ్గించండి.. తప్పుడు ప్రచారాలు నమ్మకండి’’ అంటూ బీఎల్‌ సంతోష్‌ వ్యాఖ్యానించారు.

సునీల్ బన్సల్ కీలక ఆదేశాలు..
ఎన్నికల వరకు 18 కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఆదేశించారు. ఈ నెల 20లోపు ఆరు కార్యక్రమాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
చదవండి: తమిళిసైపై హరీష్‌ రావు ఫైర్‌.. మీరు గవర్నర్‌ కావచ్చా? అంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement