కేసీఆర్‌ ఫాం హౌస్‌కు రెవెన్యూ అధికారులు.. అసలేం జరగనుంది? | Revenue Officials Inspect KCR Farmhouse Following Govt Orders | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ఫాం హౌస్‌కు రెవెన్యూ అధికారులు.. అసలేం జరగనుంది?

Sep 17 2026 3:03 PM | Updated on Sep 17 2026 5:21 PM

Revenue Officials Inspect KCR Farmhouse Following Govt Orders

సాక్షి,సిద్దిపేట: ఎర్రవల్లిలోని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణ వేగవంతమైంది. ఇందులో భాగంగా మరికాసేపట్లో రెవెన్యూ అధికారులు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌ను సందర్శించనున్నారు. ఈ విచారణ నేపథ్యంలో కేసీఆర్‌కు రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే మర్కుక్ రెవెన్యూ కార్యాలయంలో అధికారులు సంబంధిత ఫైళ్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ భూములపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులతో సమావేశమై ఫాంహౌస్ భూములపై సమీక్ష నిర్వహించారు.

మరోవైపు, శుక్రవారం సిద్దిపేటలో కాంగ్రెస్ ఎంపీలు పర్యటించనున్నారు. కబ్జా ఆరోపణలున్న భూమలను వారు పరిశీలించడంతో పాటు, రెవెన్యూ అధికారులతో సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై చర్చించనున్నారు. ఈ పరిణామాలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై విచారణ..  రంగంలోకి రెవెన్యూ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement