చంద్రబాబు చెప్పేవి సొల్లు కబుర్లు..

Minister Kodali Nani Comments On Chandrababu And Lokesh - Sakshi

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చెప్పేవి సొల్లు కబుర్లని ప్రజలకు తెలుసునని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిమ్మగడ్డ ముసుగులో చంద్రబాబు చేయాలనుకునే కార్యక్రమాలను అడ్డుకుంటామని తెలిపారు. ప్రజాదరణ ఉన్న మేము ఎన్నికలకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్‌ మాటలు విని 100 మంది బరిలో దిగారని.. అభ్యర్థులను గాలికొదిలేసి చంద్రబాబు, లోకేష్‌ ఇంట్లో పడుకున్నారని విమర్శించారు. డిపాజిట్లు కూడా దక్కవని తెలిసే చంద్రబాబు, లోకేష్‌ మొహం చాటేశారని కొడాలి నాని వ్యగ్యాస్త్రాలు సంధించారు. (చదవండి: ఆ జిల్లా ప్రజలకు ఇది శుభవార్తే..)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top