మాపై బీఆర్‌ఎస్‌ ప్రభావం ఏం ఉండదు: బొత్స సత్యనారాయణ | Minister Botsa Satyanarayana About BRS Party Impact On AP | Sakshi
Sakshi News home page

మాపై బీఆర్‌ఎస్‌ ప్రభావం ఏం ఉండదు: బొత్స సత్యనారాయణ

Oct 6 2022 3:49 PM | Updated on Oct 6 2022 4:36 PM

Minister Botsa Satyanarayana About BRS Party Impact On AP - Sakshi

సాక్షి, విజయనగరం: అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.రైతుల ముసుగులో టీడీపీ,రియల్ ఎస్టేట్ దోపిడీదారులు చేస్తుందే అమరావతి పాదయాత్ర అని మండిపడ్డారు.ఏం ఉద్దరించడానికి పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.వారికి తాము ఎందుకు సహకరించాలని నిలదీశారు.అమరావతి భూముల్ని టీడీపీ నాయకులు దోచుకున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు ఎంత దోచుకున్నారో శాసనసభ సాక్షిగా వెల్లడించినట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు సిద్ధమని పేర్కొన్నారు. 

‘టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీగా మార్చుకోవడం వాళ్ల ఇష్టం. ఏపీలో ఉన్న అనేక పార్టీల్లో బీఆర్‌ఎస్‌ ఒకటి. ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిది. బీఆర్‌ఎస్‌ ప్రభావం మాపై ఏం ఉండదు. ’ అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
చదవండి: ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడాన్ని స్వాగతిస్తాం: సజ్జల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement