Minister Ambati Rambabu Comments On Pawan Kalyan JanaSena Party - Sakshi
Sakshi News home page

జనసేన వీర మహిళలు ఎవరి మీద వీరత్వం ప్రదర్శిస్తున్నారు?

Oct 12 2022 6:13 PM | Updated on Oct 12 2022 7:35 PM

Minister Ambati Rambabu Comments On Pawan Kalyan - Sakshi

టీడీపీకి కన్ను కొడతారు. బీజేపీతో ఉన్నామంటారు. 175 సీట్లలో పోటీ చేస్తామని చెప్పే దమ్ము జనసేనకు ఉందా?.

సాక్షి, అమరావతి: టీడీపీ ముసుగులో అమరావతి యాత్ర జరుగుతోందని మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ, యాత్ర పేరుతో రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అమరావతి పాదయాత్రపై చర్చ జరగాలన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అమరావతి యాత్ర అసలు డ్రామా అర్థమవుతోందన్నారు 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకు ఏం చేశారని అంబటి ప్రశ్నించారు.
చదవండి: ‘చంద్రబాబు నాటకం బట్టబయలు.. వారంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే’

ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ లేదు. ఉత్తరాంధ్రకు గత ప్రభుత్వం ఏ మేలూ చేయలేదు. రాజకీయ కుట్రతోనే అమరావతి పాదయాత్ర జరుగుతోంది. పవన్‌ కల్యాణ్‌ను చూస్తే జాలేస్తోంది. రాజకీయాలకు ఫుల్‌టైం కేటాయించాలన్న ఆలోచన ఉండాలి. ఎవరో అధికారంలోకి రావాలని పవన్‌ పార్టీ పెట్టారు. జనసేన వీర మహిళలు ఎవరి మీద వీరత్వం ప్రదర్శిస్తున్నారు?. ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో జన సైనికులకు క్లారిటీ లేదు’’ అని మంత్రి దుయ్యబట్టారు.

టీడీపీకి కన్ను కొడతారు. బీజేపీతో ఉన్నామంటారు. 175 సీట్లలో పోటీ చేస్తామని చెప్పే దమ్ము జనసేనకు ఉందా?. ఎవరితో పొత్తులో ఉన్నారో పవన్‌కు కూడా క్లారిటీ లేదు. చంద్రబాబుకు లబ్ధి చేకూర్చే రాజకీయాలే పవన్‌ చేస్తున్నారని అంబటి ధ్వజమెత్తారు. యాత్ర పేరుతో తొడలు గొడుతున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ యాత్ర సాగిస్తున్నారు. ఈ పాదయాత్రతో చంద్రబాబు కోరిక నెరవేరదు’’ అని అంబటి రాంబాబు అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement