‘కాంగ్రెస్‌కు పోటీ టీఆర్‌ఎస్‌ మాత్రమే’ | Mallu Bhatti Vikramarka Confidence On Huge Victory Of Munugodu | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్‌కు పోటీ టీఆర్‌ఎస్‌ మాత్రమే’

Aug 7 2022 8:55 PM | Updated on Aug 7 2022 9:07 PM

Mallu Bhatti Vikramarka Confidence On Huge Victory Of Munugodu - Sakshi

ఖమ్మం జిల్లా: మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గతంలో కంటే అత్యధిక మెజారిటీని ఈసారి మునుగోడులో సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు భట్టి విక్రమార్క. ఇక్కడ కాంగ్రెస్‌కు పోటీ టీఆర్‌ఎస్‌ మాత్రమేనని పేర్కొన్న భట్టి.. పార్టీని వీక్‌ చేయడం కోసం సోషల్‌ మీడియాలో గోబెల్స్‌ ప్రచారం జరుగుతుందన్నారు.

ఇదంతా కుట్రలో భాగమేనని భట్టి అన్నారు. ఆ కుట్రలో ఎవ్వరూ పడొద్దని పిలుపుచ్చారు. ఊహాజనితమైన ప్రశ్నలు కరెక్ట్‌ కాదని అన్నారు.  వామపక్షాలను కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని అడుగుతున్నానని భట్టి ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement