ఐజ్వాల్: మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ నేషనలిస్ట్ పార్టీ (జెడ్ఎన్పీ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. శుక్రవారం జెడ్ఎన్పీ అధినేత లాల్దుహోమా చేత ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మిజోరంలో భారీ విజయం సాధించిన జెడ్ఎన్పీ నూతన ప్రభుత్వం నేడు కొలువుదీరింది.
#WATCH | Aizawl, Mizoram: Zoram People's Movement (ZPM) leader Lalduhoma takes oath as the Chief Minister of Mizoram as the swearing-in ceremony begins pic.twitter.com/oCMbU2xVSf
నవంబర్ 7న జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాల్లో జోరామ్ నేషనలిస్ట్ పార్టీ 27 స్థానాల్లో ఘన విజయం సాధించింది. మిజో నేషనల్ ఫ్రంట్ కేవలం 10 స్థానాలకే పరిమితమైంది.