రేవంత్‌ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా: జగదీష్‌రెడ్డి | Brs Leader Jagadeeshreddy Comments On Ktr case | Sakshi
Sakshi News home page

రేవంత్‌ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా: జగదీష్‌రెడ్డి

Jan 6 2025 4:27 PM | Updated on Jan 6 2025 5:24 PM

Brs Leader Jagadeeshreddy Comments On Ktr case

సాక్షి,హైదరాబాద్‌:ఎలక్టోరల్‌ బాండ్ల విషయం పాత చింతకాయ పచ్చడిలాగా ఉందని మాజీ మంత్రి,బీఆర్‌ఎస్‌ నేత జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం(జనవరి6) తెలంగాణభవన్‌లో జగదీష్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల బాండ్లకు ఏసీబీకి ఏం సంబంధం అని జగదీష్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్‌ కనుసన్నల్లోనే ఏసీబీ డ్రామా ఆడుతోందని విమర్శించారు.

‘గ్రీన్ కో  కంపెనీ దేశంలో  7,8 పార్టీలకు  ఎలక్ట్రోలర్ బాండ్లు ఇచ్చింది.కేసు రూ. 55 కోట్లు ట్రాన్స్‌ఫర్‌కు  సంబంధించింది.ఇక్కడ గ్రీన్ కో కంపెనీకి ఎక్కడా లాభం జరగలేదు.ఏసీబీ కేసుకు ,గ్రీన్ కో  కంపెనీకీ ఏం  సంబంధం.రైతు భరోసా ఎగగ్గొట్టిన విషయం డైవర్ట్‌ చేయడానికే కేటీఆర్‌కు  ఏసీబీ నుంచి నోటీసులు వచ్చాయన్నారు.ఈ డైవర్షన్ పాలిటిక్స్‌తో  రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేడు.

గ్రీన్ కో కంపెనీ ఎలక్ట్రో బాండ్లు చట్టం ప్రకారం బీఆర్‌ఎస్‌ పార్టీకి వచ్చాయి.ఇందులో  దాపరికాలు  ఏం లేవు.రేవంత్‌రెడ్డి  ఇందులో కనిపెట్టింది ఏం లేదు. కేటీఆర్‌పై కుట్ర కేసులో ప్రభుత్వానికి ప్రతిసారి షాక్ తగులుతోంది.ప్రభుత్వం బొక్క బోర్లా పడుతోంది. కేటీఆర్‌పై పనికిమాలిన చెత్త కేసు పెట్టి,చిల్లర ప్రయత్నం చేసింది ప్రభుత్వం.

ప్రభుత్వం వద్దే అన్ని  ఫైల్స్‌ ఉన్నాయి.కేటీఆర్‌ ఇంటిపై  ఏసీబీ సోదాలు చేసి ఏవో ఫైల్స్‌ దొరికాయని లేనిది ఉన్నట్టు క్రియేట్ చేయాలని  ఏసీబీ ప్రయత్నం చేస్తోంది.చట్టం,రాజ్యాంగం పట్ల  గౌరవంతో కేటీఆర్‌ విచారణకు  హాజరయ్యారు. రేవంత్ కనుసన్నల్లో ఏసీబీ డ్రామా ఈ రోజు కుదరలేదు’అని జగదీష్‌రెడ్డి విమర్శించారు. 

ఇదీ చదవండి: ఇది రేవంత్‌ టీఎం చేస్తున్న దుష్ప్రచారం: కేటీఆర్‌

Advertisement
 
Advertisement
Advertisement