గ్రామాలు పరిశుభ్రం | - | Sakshi
Sakshi News home page

గ్రామాలు పరిశుభ్రం

Sep 18 2026 2:21 AM | Updated on Sep 18 2026 2:21 AM

● 17,18 తేదీల్లో స్వచ్ఛ పాఠశాలల్లో యువ ఫర్‌ స్వచ్ఛత, 4 విధాల చెత్త వేరుచేయడంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు. ● 19, 20 తేదీల్లో గ్రామాల్లో చెత్త పేరుకపోయిన ప్రాంతాలను గుర్తించి శుభ్రపర్చే కార్యక్రమాలు, సుందరీకరణ. ● 21,22 తేదీల్లో మార్కెట్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, బస్టాండ్లు, పార్కులు, జల వనరులు, ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రత. ● 23, 24 తేదీల్లో అబ్‌ దే నహీ దార్‌ గ్రామాల్లో 4 రకాల వ్యర్థాల (తడి/సేంద్రియ, పొడి, శానిటరీ, ప్రత్యేక వ్యర్థాలు) మూలాల్లోనే వేరు చేయడంపై చైతన్యం, గృహ కంపోస్టింగ్‌, ప్లాస్టిక్‌ నివారణ. ● 25,26 తేదీల్లో స్వచ్ఛత కోసం క్రీడలు, జీరో వేస్ట్‌పై క్రీడా కార్యక్రమాలు, క్రీడా మైదానాల శుభ్రత. ● 27న పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాల శుభ్రత, మరుగుదొడ్ల నిర్వహణ, బాధ్యతా యుత పర్యాటకంపై అవగాహన. ● 28,29 తేదీల్లో కబాడ్‌ సే జుగాడ్‌, కబాడ్‌ సే కళ, ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ వ్యర్థాల విలువలపై అవగాహన. ● 30న సఫాయిమిత్రలకు ఆరోగ్య పరీక్షలు, సంక్షేమ పథకాల అనుసంధానం, రక్షణ పరికరాల పంపిణీ, సత్కారం. ● అక్టోబర్‌1న ఏక్‌ దిన్‌, ఏక్‌ ఘంటా, ఏక్‌ సాత్‌: కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల భాగస్వామ్యంతో సామూహిక శ్రమదానం. ● 2న ప్రత్యేక గ్రామసభలు, స్వచ్ఛతపై అవగాహన, మొక్కలు నాటడం..

పెద్దపల్లి: గ్రామాల పరిశుభ్రతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా 2026 కార్యక్రమాలను ఈనెల 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు స్వచ్ఛతలో భాగస్వామ్యం–స్వచ్ఛ భారత్‌, వికసిత్‌ భారత్‌ ఇతివృత్తంతో చేపట్టనున్న వివిధ కార్యక్రమాల్లో ప్రజలు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛతా కార్మికులను భాగస్వామ్యం చేస్తూ గ్రామాల్లో పారిశుధ్యంపై అవగాహన కల్పించనున్నారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులు, బస్టాండ్లు, పార్కులు, ప్రజాప్రదేశాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడతారు. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026పై అవగాహన, చెత్తను తడి పొడి వ్యర్థాలుగా వేరు చేయడం, ఇంటింటి నుంచి వ్యర్థాల సేకరణ, ఆర్‌ఆర్‌ఆర్‌పై ప్రచారం నిర్వహించనున్నారు. అక్టోబర్‌ 2న ప్రత్యేక కార్యక్రమాలతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు ముగించనున్నారు.

రోజువారీ కార్యక్రమాలు

పకడ్బందీగా ఏర్పాట్లు

గ్రామపంచాయతీల వారీగా అందరికీ సమాచారం ఇచ్చాం. గురువారం నుంచి అక్టోబర్‌ 2 వరకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సహకరించి విజయవంతం చేసేలా చూడాలి.

– రాఘవులు, ఆర్పీ, డీఆర్డీవో, పెద్దపల్లి

జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలకు శ్రీకారం

అక్టోబర్‌ 2వరకు నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement